భారత క్రికెట్ జట్టులో సచిన్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తిగా ధోనీ అందరి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాడు ఒక రకంగా చెప్పాలంటే సచిన ని ఇష్టపడే ఎంతో మంది ధోనీ ని సైతం ఇష్టపడుతారు అంటే అతిశయోక్తి కాదు..అయితే ధోనీ తన అభిమానులకి అప్పుడప్పుడు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు అలాగే  ఒక వీరభిమానికి కూడా ధోనీ భారీ సర్ప్రైజ్ ఇచ్చాడు దాంతో ఆ అభిమానికి పట్టలేని సంతోషం కలిగింది. వివరాలలోకి వెళ్తే..

 Image result for ms-dhoni-hosts-lunch-cricket-die-hard-fan-sudhir-gautam

ధోనీ ఆటతో అభిమానులని  అలరించడం మాత్రమే కాదు చిన్న చిన్న సర్ప్రైజ్ అభిమానులకి ఇస్తూ వారిని సంతోష పెడుతూ ఉంటాడు కూడా...అయితే ధోనీ తనకి వీరాభిమాని అయిన సుదీర్ గౌతం కి విందు ఇచ్చి బిగ్ సర్ప్రైజ్  ఇచ్చాడు...ధోని తన  ఫామ్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విందుకు హాజరైన సుధీర్‌.. ‘ కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనితో ఒక ప్రత్యేకమైన రోజు. ఫామ్‌హౌజ్‌లో సూపర్‌ ఫ్యామిలితో సూపర్‌ లంచ్‌. ఆ అద్భుతమైన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. ధోని, సాక్షి అక్కకు ధన్యవాదాలు. అంటూ ట్విట్టర్ వేదికగా ఫోటోలు పెట్టి సంతోషం వ్యక్తం చేశాడు..

 Image result for ms-dhoni-hosts-lunch-cricket-die-hard-fan-sudhir-gautam

అయితే సుదీర్ మొదట సచిన్ వీరాభిమానిగా గుర్తింపు పొందాడు..ధోనీ అంటే కూడా ప్రత్యేకమైన అభిమానం చూపిస్తాడు..సచిన్‌ మ్యాచ్‌లు వీక్షించడం కోసం ఎన్నోసార్లు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లకు సైతం సైకిల్‌పై ప్రయాణించి తన అభిమానానికి హద్దులు లేవని చాటి చెప్పాడు..అభిమానికి మర్చి పోలేని ట్రీట్ ఇచ్చిన ధోనీ మనసు ఎంతో గొప్పది అంటూ నెటిజన్లు వరుస ట్వీట్ల తో ముంచెత్తుతున్నారు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: