ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి , పిల్లలు కుటుంభం..ఇలా జీవితాంతం కొన్ని భందాలు విడదీయలేని అనుభందాన్ని ఏర్పరుస్తాయి..అయితే బిజీ బిజీ జీవితంలో ఎంతో మంది కుటుంబానికి వారి ప్రేమలకి దూరం అవుతారు..అయితే ఎంత సంపాదించినా గడిచిపోయిన రోజులు తిరిగిరావు ఇదే పరిస్థితి టీం ఇండియా మాజే కెప్టెన్ ధోనీ విషయంలో నిజం అవుతోందిల..స్వయంగా తనంతాట తాను ఈ విషయాన్ని అంగీకరించాడు..తన కూతురు తనని మరో మనిషిని చేసింది అంటూ తెగ సంబరపడిపోతున్నాడు..

 Image result for dhoni & his daughter

తన కూతురు జీవా.. తనని మరో మనిషిని చేసింద అంటున్న ధోనీ తన జీవితంలో ఎన్నో మార్పులకి కారణం తన కూతురు జీవా అంటున్నాడు..ఎప్పుడు తన ఫ్యామిలీ విషయాలు మీడియా ముందు చెప్పని ధోనీ ఇప్పుడు తన కూతురు గురించి చెప్తూ తెగ సతోషం వ్యక్తం చేస్తున్నాడు..స్టార్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన ఓ షోలో పాల్గొన్న మహీ.. తన కూతురుకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. నేను క్రికెటర్‌గా ఎలా మారానో నాకు తెలియదు. కానీ నన్ను మనిషిగా మార్చింది మాత్రం నా కూతురు జీవా. ఎందుకంటే కూతుళ్లు వాళ్ల తండ్రులకు చాలా దగ్గరగా ఉంటారని విన్నా అని ధోనీ వెల్లడించాడు.

 

జీవా పుట్టినప్పుడు తాను దగ్గరగా లేకపోవడం తనకెంతో భాధ కలిగించిందని అన్నాడు..ఎక్కువగా క్రికెట్ ఆడుతూ దేశాలు తిరుగుతుండటంతో తన కూతురితో ఎక్కువగా గడుపలేకపోయానని చెప్పాడు.జీవా అన్నం తినకపోతే వాళ్లమ్మ.. నాన్న వస్తున్నారు త్వరగా తినేయ్ అనే భయపెట్టేది. అల్లరి చేసినప్పుడు నాన్నా వస్తున్నాడు అలా చేయొద్దని చెప్పేది. దీంతో ఎప్పుడైనా జీవాను దగ్గరకు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇవి గుర్తొచ్చి ఓ అడుగు వెనుకకు వేసేది.ధోనీ చెప్పాడు..

 

అయితే జీవా నాపై భయాన్ని ప్రదరిస్తుంటే భాదపడ్డాను అయితే  ఈ ఐపీఎల్ నా కూతురిని నాకు మరింత దగ్గరకు చేర్చింది అని ధోనీ చెప్పుకొచ్చాడు..ఈసారి లీగ్‌లో ప్రతి మ్యాచ్‌కు జీవా తనతో పాటే ఉందని..ఇకమీదట జీవాని విడిచి ఒక్క రోజు కూడా ఉండలేనని చెప్తున్నాడు..కూతురా మజాకానా


మరింత సమాచారం తెలుసుకోండి: