ఆసియా గేమ్స్ లో భారత క్రీడాకారుల పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది..పతకాల వేటలో వారు కొనసాగిస్తున్న పోరు ఎంతో అద్భుతమనే చెప్పాలి..ఆసియా గేమ్స్ లో భారతీయులు ఎంతో శ్రమించి సాధిస్తున్న పతకాలకి ఎంతో మంది భారతీయులు మద్దతు తెలుపుతున్నారు..అయితే ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఈ గేమ్స్ లో
శనివారం పోటీల్లో భాగంగా భారత్ స్క్వాష్లో రెండో పతకం సాధించింది..స్క్వాష్ మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన జ్యోష్న చిన్నప్ప కాంస్య పతకం సాధించింది... జ్యోష్న చిన్నప్ప సెమీస్లో భాగంగా మలేసియాకు చెందిన సుబ్రమణియమ్ శివసంగరితో తలపడి 1-3తో ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది..దాంతో భారత్ కి స్క్వాష్ పోటీల్లో రెండో కాంస్యం వచ్చింది..
అయితే ఈ పోటీల్లో భారత్ కి రెండో కాంస్యం రావడం విశేషం..అంతకముందు సెమీస్లోనే ఓడిన దీపికా పల్లికల్ కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే...తాజా పతకంతో ఆసియా గేమ్స్లో భారత పతకాల సంఖ్య 27కు చేరింది. ప్రస్తుతం భారత ఖాతాలో 6 స్వర్ణ, 5 రజత, 16 కాంస్య పతకాలు ఉన్నాయి.