భారత్-పాక్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరుదేశాల్లోని అభిమానులే కాదు.. గ్యాంగ్ స్టర్లు కూడా వీక్షించడానికి ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆసియా కప్లో ఎన్ని మ్యాచ్లు జరిగినా భారత్-పాక్ మ్యాచ్కు ఉండే ప్రత్యేకతే వేరు. మొదటి నుంచి నువ్వా అంటే నువ్వా అంటూ పోరుకు సిద్దమయ్యే భారత్-పాక్ ఆటగాళ్ల తీరు ఎప్పుడూ సంచలనంగా ఉంటుంది. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్థాన్తో పాటు హాంకాంగ్ జట్లు టైటిల్ రేస్లో ఉన్నాయి. ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైనప్పట్నించి ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచమంతా ఎంతో ఆసిక్తిగా ఎదురు చూస్తోంది.
కాగా, భారత్-పాక్ మ్యాచ్ గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నెట్వర్క్కి ముఖ్యమైన సమాచారం అందింది. దావూద్ ఇబ్రహీం, డి కంపెనీకి చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు ఈ మ్యాచ్ వీక్షించనున్నారని ఏజెన్సీలకు సమాచారం అందింది. రౌండ్ రాబిన్ పద్ధతిన టోర్నీ జరుగుతుండటంతో గ్రూప్ దశలో మూడు జట్లు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి.
మంగళవారం హాంకాంగ్తో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా... ఆ తర్వాతి రోజైన బుధవారం పాకిస్థాన్తో అమీతుమీత తేల్చుకోనుంది. ఇదిలా ఉంటే.. అన్షే ఖాన్ నాయకత్వంలోని హాంకాంగ్ జట్టు పాకిస్థాన్తో జరిగిన తొలి గ్రూప్-ఏ మ్యాచ్లో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబై, కరాచీ నగరాల క్రికెట్ అభిమానులు, మాఫియా మ్యాచ్ చూడటం కోసం దుబాయ్ వెళ్లారు. దీంతో భారత్, బ్రిటన్, అమెరికా, రష్యా, చైనాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు ఈ మ్యాచ్పై నిఘా పెట్టారు.