ఆసియా కప్ సీరీస్ లో భాగంగా భారత జట్టు విజయాల పరంపర నమోదు చేసుకుంటూ దూసుకుపోతోంది. మరో పక్క చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ పై విజయాన్ని నమోదు చేసి అభిమానులలో సంతోషాన్ని నింపింది. ఇదిలాఉంటే కోహ్లీ వరుస సీరీస్ లతో అలసి పోయాడు దాంతో ఆదివారం జరుగనున్న భారత్ పాకిస్థాన్ మ్యాచ్ కి దూరం కానున్నాడు అయితే ఈ సందర్భంలో
కోహ్లీ తమ పాకిస్థాన్ జట్టుపై ఆడకుండా విశ్రాంతి తీసుకోవడంపై స్పందిస్తూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ అంటే ఉన్న భయం కారణంగానే ఆసియా కప్ నుంచి కోహ్లీ పారిపోయాడని..అతడెంతో పిరికి వాడనే అర్థం వచ్చే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు..ఇంగ్లాండ్ తో అన్ని మ్యాచ్ లు ఆడిన కోహ్లీ మాతో ఆడలేడా అంటూ తన్వీర్ వ్యాఖ్యానించాడు.
అయితే తన్వీర్ వ్యాఖ్యలపై భారత జట్టు క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. “విరాట్ కోహ్లీ” ఇప్పటికే 35-36 సెంచరీలు చేశాడు...ఇన్ని కబుర్లు చెప్పే వాడివి నువ్వు కోహ్లీ కొట్టిన సెంచరీల లెక్కకు లేవు నువ్వు ఆడిన మ్యాచ్ లు అంటూ చాలా ఘాటుగానే స్పందించాడు..అతడిని అనడానికి అలోచించి మాట్లాడాలి అది గుర్తు పెట్టుకో అంటూ అదిరిపోయే కౌంటర్ వేశాడు.