భారత
క్రికెట్ చరిత్రలో సచిన్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుందని అనడంలో సందేహం
లేదు. కేవలం భారత్ సంభందిన వరకూ మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో క్రికెట్ ఉన్నంతకాలం
సచిన్ పేరు మారు మోగుతూనే ఉంటుంది...అయితే తాజాగా సచిన్ విషయంలో శ్రీశాంత్ షాకింగ్
కామెంట్స్ చేశారు.అంతేకాదు కన్నీటిని రాల్చాడు..ఇంతకీ అసలేం జరిగింది..ఎందుకు
శ్రీశాంత్ ఏడ్చాడు అంటే...
సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్బాస్ సీజన్ 12లో ప్రస్తుతం కంటెస్టెంట్గా ఉన్న శ్రీశాంత్.. తాను తీవ్ర భావోద్వేగానికి గురైన సందర్భాన్ని హౌస్లో చెప్పి కన్నీటి పర్యంతం అయ్యాడు...అయితే “2011” ప్రపంచకప్ ముగిసిన ఏడాది తర్వాత ఓ ఇంటర్వ్యూలో భారత్ జట్టు వరల్డ్ కప్లో ఆడిన తీరు గురించి ప్రశంసించారు. ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి.. జట్టులోని ఆటగాళ్లందరి కృషిని పొగిడాడు.. ఒక్క నా గురించి తప్ప..
అయితే
ఇక ఇంటర్వ్యూ ముగుస్తుందన్న సమయంలో సచిన్ టెండూల్కర్ చొరవ తీసుకుని టీమిండియా
ప్రపంచకప్ గెలవడంలో శ్రీశాంత్ కూడా క్రియాశీలక పాత్ర పోషించాడు అని చెప్పాడు. ఆ
మాటలు విని నాకు చాలా ఏడుపొచ్చేసింది
అంటూ శ్రీశాంత్ గతాన్ని గుర్తు చేసుకున్నాడు..అయితే కోర్టు శ్రీశాంత్ ని
నిర్దోషిగా ప్రకటించినా బేసేసేఐ ఇప్పటికి అతడిపై నిషేదాన్ని ఎత్తివేయలేదు.