టీమిండియా పరుగుల జోరు కొనసాగుతోంది...వెస్ట్ ఇండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో చూడచక్కని ప్రతిభ కనబరచిన టీమిండియా వన్డే లలో కూడా అదే ఊపుని కొనసాగిస్తోంది...విండీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా చెలరేగి ఆడింది...రోహిత్ శర్మ, అంబటి రాయుడు సెంచరీలతో చెలరేగిపోయారు. వీరిద్దరి దెబ్బకు స్కోరు బోర్డు అలుపన్నదే లేకుండా పరుగులు తీసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసి విండీస్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది.

 Image result for india vs south africa odi 2018

అయితే, 71 పరుగుల వద్ద శిఖర్ ధవన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ కూడా 16 పరుగులకే అవుటవడంతో ఒక్క సారిగా అభిమానులు షాక్ తిన్నారు..కానీ  అంబటి రాయుడితో కలిసి రోహిత్ శర్మ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును వేగంగా పరుగులు పెట్టించడంతో పాటు అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోహిత్...98 బంతుల్లో 13 ఫోర్లు..సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా రోహిత్ జోరు కొనసాగింది.

 Image result for india vs south africa 4th odi 2018

రోహిత్ 162 పరుగుల వద్ద నర్స్ బౌలింగ్‌లో చందర్‌పాల్ హేమ్‌రాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా మరోవైపు రాయుడు కూడా సెంచరీ నమోదు చేశాడు. 81 బంతుల్లో  8 ఫోర్లు, 4 సిక్సర్లతో కెరీర్‌లో మూడో శతకం సాధించాడు. ధోనీ 23, కేదార్ జాదవ్ 16(నాటౌట్), రవీంద్ర జడేజా 7(నాటౌట్) పరుగులు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: