టీమిండియా
మాజీ కెప్టెన్ ధోనీ ని భారత టీ20 జట్టునుంచీ సెలక్టర్లు
తప్పించడం పై సర్వాత్రా నిరసనలు రేగుతున్నాయి..తమ అభిమాన క్రికెటర్ ని ఎందుకు తొలగించారో
చెప్పాలని అభిమానులు కోహ్లీ పై కూడా విమర్శలు చేయడం మొదలు పెట్టారు..అయితే ఈ
తరుణంలోనే సచిన్
టెండూల్కర్ పై ధోనీ పై వేసిన వేటు విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు..
అసలు ధోనీ ని పక్కకి తప్పించింది కేవలం అతని స్థానంలో రిషబ్ పంత్కి వికెట్ కీపర్గా ఇవ్వడానికేనని...రిషబ్ పంత్ లాంటి యువ క్రికెటర్లకి ఛాన్స్ ఇచ్చేందుకు ధోనీనే స్వయంగా సెలక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తూ పక్కకి తప్పుకున్నాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు...కానీ ధోనీ ప్రస్తుతానికి ఫాం లో లేడని అందుకే తప్పించారని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఈ విషయంపై సచిన్ కూడా స్పందించాడు.. సెలక్టర్లు ధోనీ విషయంలో ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు..వారి ఆలోచనలేంటో..నాకు తెలియదు కానీ నా అభిప్రాయం చెప్పి అందరిని ఇబ్బంది పెట్టలేను కావున నేను ఈ విషయంలో ఏమీ మాట్లాడలేను వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే అది టీమిండియా ప్రయోజనాల కోసమే అని గుర్తించాలని సచిన్ తన అభిప్రాయాని తెలిపాడు.