గడిచిన కొన్ని రోజుల క్రితం ఓ క్రికెట్ అభిమాని చేసిన ట్వీట్ కి స్పందిస్తూ కోహ్లీ చేసిన ట్వీట్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఏకంగా ఆ సందర్భంలో కోహ్లీ ‘‘ ఇండియా వదిలి వెళ్లిపో’’ అంటూ అతడిపై కామెంట్స్ చేశాడు..దాంతో ఎంతో మంది నెటిజన్లు సైతం కోహ్లీపై విరుచుకుపడ్డారు..ఇదిలాఉంటే ఇప్పుడు కోహ్లీపై భారత చెస్ దిగ్గజం గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Related image

కోహ్లీపై ఒక్క నెటిజన్లు మాత్రమే కాదు మాజీ క్రికెటర్లు సైతం పెదవి విరుస్తున్న సమయంలో అసలు క్రికెట్ తో ఎటువంటి సంభంధం లేని చెస్ ఆటగాడు విశ్వనాద్ ఆనంద్ కామెంట్స్ చేయడం సంచలనం సృష్టిస్తోంది...ఈ క్రమంలోనే ఆయన ట్వీట్ చేస్తూ “విరాట్ భావోద్వేగానికి గురై నిగ్రహం కోల్పోయి ఉండొచ్చని” తన అభిప్రాయాని వెల్లడించాడు..

 Image result for kohli twitter comments

‘విరాట్ నియంత్రణ కోల్పోయాడనుకుంటా.. కాస్త భావోద్వేగానికి గురై మనసులోనుంచీ ముందుగా వచ్చే మాటల్ని పలికాడు కోహ్లీ..ఇలాంటి ప్రవర్తన వలన  కోహ్లీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది అంటూ సలహా ఇచ్చాడు ఆయన. అభిమానిపై ఆ విమర్శ చేసినప్పుడు అతడెలాంటి పరిస్థితిలో ఉన్నాడో..? కాస్త సున్నితంగా, బలహీన క్షణాల్లో ఉన్నాడేమో..మంచి మూడ్‌లో లేకపోవచ్చు..అంటూ కోహ్లీ కి క్లాస్ పీకాడు. విశ్వనాద్ ఆనంద్.


మరింత సమాచారం తెలుసుకోండి: