ఆడిలైడ్ మైదానంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ కష్టాల్లో పడ్డట్టు తెలుస్తుంది. ఆడిలైడ్ వేదికగా భారత్ -ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మంచి ఫాంలో ఉన్న భారత బ్యాట్స్మెన్స్ స్కోర్ బోర్డ్ని పరుగులెత్తిస్తారనుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కి క్యూ కట్టారు.
లంచ్ సమయానికి 27 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) మరోసారి నిరాశ పరచగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13) తొందరగానే పెవిలియన్ చేరుకున్నారు.
ప్రస్తుతం క్రీజులో చటేశ్వర పుజారా (11), రోహిత్ శర్మ(15) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజెల్ వుడ్ 2 వికెట్లు పడగొట్టగా, స్టార్క్, కుమిన్స్ కు చెరో వికెట్ లభించాయి.ఆస్రేలియా బౌలర్స్లో హాజిల్వుడ్కి రెండు వికెట్స్ దక్కగా, స్టార్క్, కమిన్స్ చెరో వికెట్ తీసారు.