ప్రపంచంలో క్రికెట్ అంటే ఎంతగా అభిమానిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా క్రికెట్ వస్తుందంటే టివిలకు అతుక్కు పోతుంటారు అభిమానులు.  తాజాగా మెల్‌ బోర్న్‌ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. 
Mayank Agarwal
ఈ ఆటలో అరంగేట్రం చేసి, తొలి మ్యాచ్ లోనే ఓపెనర్ గా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్, సెలక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, 95 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
Mayank Agarwal
ఇందులో ఆరు ఫోర్లు కూడా ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్ లో  ఓపెనింగ్ జోడీలో మార్పులు చేశారు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో విఫలమైన రాహుల్, మురళీ విజయ్‌ ల స్థానంలో హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ లను పంపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: