ఈ మద్య సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. తాజాగా టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   టీమిండియా మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో 137 పరుగుల తేడాతో  విజయం సాధించింది.  ఈ గెలుపుతో భారత్ 2-1తో ఆధిక్యంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ముందంజలో నిలిచింది.

ఇక భారత జట్టు  విజయాలతో ముందుకు సాగుతుందని..ఇదే జోష్ ముందు ముందు కొనసాగిస్తామని టీమిండియా కెప్టెన్ కోహ్లీ అంటున్నారు.  భారత జట్టు విజయం సాధించిన అనంతరం కోహ్లీ సేన బస్సులో హోటల్‌కు బయలుదేరింది. కాగా, భారత జట్టుకు అధికారికంగా మద్దతు ఇచ్చే భారత్ ఆర్మీ సభ్యులు హోటల్ వద్ద భారత జట్టుకు సాదర స్వాగతం పలికారు. బస్సు నుంచి సభ్యులు ఒక్కొక్కరుగా కిందికి దిగారు.

అయితే  ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాత్రం దిగుతూనే బీర్ తాగుతూ ఫోజ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత్ ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియోపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: