కోహ్లీసేన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో మౌంట్ మాంగనూయ్లో మూడో వన్డే లో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ధోనీకి విశ్రాంతి కల్పించినట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. అతడి స్థానంలో దినేశ్ కార్తీక్ను జట్టులోకి తీసుకున్నట్టు తెలిపాడు.
నెపియర్, మౌంట్ మాంగనూయ్లలో జరిగిన తొలి, రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన కోహ్లీ సేన ఈ మ్యాచ్ను కూడా గెలుచుకుని సిరీస్ను ఇక్కడే దక్కించుకోవాలని గట్టి పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటై భారత్ ముందు ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 244 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది.
కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రాహుల్ శర్మలు మరోసారి అద్భుత ఆటతీరును కనబరిచి భారత్ విజయానికి బాటలు పరిచారు. ఐదు వన్డేల సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి 3-0 ఆధిక్యంలో నిలిచింది. వరుసగా రెండో వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (60), రోహిత్ శర్మ (62), అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ రాణించారు.