తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి చిత్రం రాజకుమారుడు.   ఈ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ ప్రీతీజింటా.  ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ బాలీవుడ్ బామ తర్వాత బాలీవుడ్ లోనే ఎక్కువ చిత్రాల్లో నటించింది.  అయితే ఐపిల్ క్రికెట్ మ్యాచ్ గురించి అందరికీ తెలిసిందే. 

ప్రస్తుతం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ యజమాని ప్రీతి జింటా కొనసాగుతున్నారు. తన ఆటగాళ్లను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ తన జట్టు విజయం సాధించగానే.. మైదానంలోకి వచ్చి ఆటగాళ్లకు తనదైన రీతిలో అభినందనలు తెలియజేస్తుంది ప్రీతీజింటా.  ఈ నేపథ్యంలో . ఐఎస్‌ బింద్రా మైదానంలో సోమవారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ విజయం సాధించింది.

అంతే ఇక తన జట్టు గెలిచిన ఆనందంతో ప్రీతీ జింటా  మైదానంలోకి వచ్చి ఆటగాళ్లకు అభినందనలు తెలిపింది. ఆ సమయంలో కరన్‌ దగ్గరకు రాగానే.. ఇద్దరూ కలిసి భాంగ్రా నృత్యం చేశారు.  తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: