మహేంద్ర సింగ్ ధోని ఇంట్లో దొంగతనం జరిగింది.  ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది..చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోని దూకుడుతో ఆడుతున్న తీరు చూస్తుంటే క్రికెట్ అభిమానుల్లో నూతనోత్తేజం కలుగుతుంది.  ఈ మద్య వరుసగా సిక్స్, ఫోర్లు బాదుతున్న ధోనిని చూస్తుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని..ఆయన బ్యాటింగ్ చూస్తుంటే భయం వేసిందని ఆ మద్య కోహ్లీ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

ఓ వైపు ఐపీఎల్ మ్యాచ్ లో ధోని బిజీగా ఉంటే..మరోవైపు దొంగలు ఆయన ఇంటిని దోచే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. యూపీలోని నోయిడాలో ఉన్న సెక్టార్ 104లో ఉన్న ఓ ఇంటిని ధోని గతంలో కొన్నారు. ఇటీవల దీన్ని విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు.  గత నెల 29 న దోని ఇంటికి విక్రమ్ రాగా..అప్పటికే ఇంటి తాళం పగుల గొట్టి ఉంది. 

ఈ విషయం వెంటనే ధోనికి తెలియపర్చారు విక్రమ్...అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కాగా, ఇంటిలో  రీదైన ఎల్ఈడీ టీవీతో పాటు కొన్ని వస్తువులు మాయమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: