ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జోరు కొనసాగుతుంది. అయితే ప్రతిసారి ఐపీఎల్లో ఏదో ఒక కాంట్రవర్సీలు జరుగుతూనే ఉన్నాయి. బ్యాట్ మెన్స్, బౌలర్స్ విషయంలో కొన్ని విదావాదలు నడిస్తే..థార్డ్ అంపైర్ విషయంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. ఇక టాప్ లెవెల్ ఆటగాళ్లు ఢీలా పడితే..అప్పుడే వచ్చిన ఆటగాళ్లు రికార్డుల మోత మోగిస్తుంటారు. తాజాగా ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ-అంపైర్ నిగెల్ లాంగ్ మధ్య గొడవ జరిగింది.
బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన 20వ ఓవర్లో ఓ బంతిని అంపైర్ నిగెల్ నోబాల్గా ప్రకటించాడు. అయితే, టీవీ రీప్లేలో అది నోబాల్ కాదని తేలింది. దాంతో బెంగళూరు కెప్టెన్ కోహ్లీ, బౌలర్ ఉమేష్ నిగేల్ వ్యవహారంపై తీవ్ర నిరసన తెలిపారు. అంతే కాదు అలా ఎలా ఇస్తారని..గ్వివాదానికి దిగారు... అదేమీ పట్టించుకోని నిగెల్ వెళ్లి బంతి వేయాల్సిందిగా యాదవ్కు సూచించాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ అయిన నిగెల్ (50) సన్రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం అంపైర్ రూములోకి వెళ్లాడు. విసురుగా అక్కడి గది తలుపును తన్నాడు.
దీంతో అది కాస్తా ధ్వంసమైంది. దాంతో అంపైర్ తీరును తీవ్రంగా పరిగణించిన కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) దీనిని క్రికెట్ పాలక మండలి (సీఓఏ) దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే తన వల్ల నష్టం వాటిల్లినందుకు తలుపు మరమ్మతుల కోసం అంపైర్ నిగెల్ రూ.5 వేలు చెల్లించినట్టు తెలుస్తోంది.