ప్రపంచం మొత్తం క్రికెట్ అంటే ఎంతగా ఇష్టపడుతుందో అందరికీ తెలిసిందే.  అందులోనూ వరల్డ్ కప్ మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్. చిన్న పెద్దా అనే తేడా లేకుండా టివిలకు అతుక్కు పోతుంటారు.  ప్రస్తుతం ఎక్కడ చూసినా వరల్డ్ కప్ మానియా నడుస్తుంది.  ఇక టీమ్ ఇండియా కూడా ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో తన సత్తా చాటుతుంది. 

అయితే ఇప్పుడు టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్..డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ కు దూరమయ్యాడు. ఆదివారంనాడు ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్ సందర్భంగా ధావన్ గాయపడ్డాడు. ఎడమచేతి బొటనవేలికి ఫ్యాక్చర్ అయినట్టు స్కానింగ్ లో తేలింది. దాంతో శిఖర్ దావన్ కి మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. 

ఈ నేపథ్యంలో  న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ లతో జరగనున్న మ్యాచ్ లను ధావన్ లేకుండానే టీమిండియా ఆడనుంది. ధావన్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ లేదా రిషభ్ పంత్ లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. నిన్నటి వరకు టీమ్ ఇండియా తరపు నుంచి దూకుడుగా ఆడుతున్న శిఖర్ దావన్ ఇలా నిష్క్రమించడం క్రికెట్ అభిమానులకు తట్టుకోలేక పోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: