సంచలనాలకు మారుపేరు వరల్డ్ కప్.  క్రికెట్ వరల్డ్ కప్ లో ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటున్నది.  వెస్ట్ ఇండీస్ తప్పకుండా మళ్ళీ కప్పు కొట్టేందుకు సిద్ధం అవుతుంది అనే టీం తో అడుగుపెట్టింది.  ఐపీఎల్ మ్యాచ్ లలో వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు ఇరగదీస్తుంటారు.  


అందుకే ఆ టీం సూపర్బ్ గా ఉంటుంది అనుకున్నారు.  కానీ, అక్కడ జరిగింది మరొకరి అయ్యింది.  ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ లలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.  అది మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో.  ఆ తరువాత వరసగా ఓడిపోవడం మొదలైంది.  


చివరకు ఈరోజు బాంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సైతం వెస్ట్ ఇండీస్ ఓటమిపాలైంది.  ఎవరూ ఊహించలేదు.  వెస్ట్ ఇండీస్ ఓడిపోతుంది అని.  ఎందుకంటే, నిర్ణిత యాభై ఓవర్లలో 322 పరుగులు చేసింది.  మాములుగా చెప్పాలి అంటే ఇది భారీ స్కోర్.  బాంగ్లాదేశ్ వంటి చిన్న జట్టుకు ఇది అతిపెద్ద స్కోర్.  


వన్డే క్రికెట్ లో ఎవరు నిలబడి ఆడగలుగుతారో వారే విజేతలు.  ఎలాగైనా గెలవాలి అనే కసితో బాంగ్లాదేశ్ జట్టు ఆడింది.  కేవలం 41.3 ఓవర్లలోనే 322 పరుగుల స్కోర్ ను బీట్ చేసింది.  బాంగ్లాదేశ్ జట్టు బలమైన వెస్ట్ ఇండీస్ పై గెలవడం అంటే మాములు విషయం కాదు.  అందులోను 322 పరుగుల స్కోర్ ను బీట్ చేయడం అంటే మాటలా.  చూస్తుంటే.. రాబోయే రోజుల్లో పాక్ స్థానాన్ని బాంగ్లాదేశ్ జట్టు ఆక్రమించినా ఆశ్చర్యపోనవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: