క్రికెట్ మైదానంలోకి అడుగు పెడితే...బౌలర్లకు వణుకు పుట్టే విధంగా బ్యాంటింగ్ చేస్తూ సిక్స్, ఫోర్లు బాదేస్తూ...క్రికెట్ అభిమానులను ఆనందింప జేసే బెస్ట్ క్రికెటర్ శిఖర్ దావన్ ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ 2019 కి పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో బొటనవేలి ఎముక విరిగిన కారణంగా ఒకటీ రెండు మ్యాచ్ లకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించినప్పటికీ..ఆయన గాయం ఇప్పటి వరకు తగ్గక పోవడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం.  దాంతో ఆయన మిగిలిన మ్యాచ్ లకు దూరం కాక తప్పడం లేదు. 

తాజాగా  శిఖర్  దావన్ పెట్టిన ఓ వీడ్కోలు పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తీవ్రమైన భావోద్వేగంతో ఉన్న ధావన్, ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో మాట్లాడాడు. టోర్నీ నుంచి తను వెళ్లిపోతున్నానని చెప్పాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్లి, కప్ ను సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నాడు. 

అంతే కాదు తాను గాయపడ్డపు తనకు ఎంతో ధైర్యం చెబుతూ మద్దతు ఇచ్చిన సహ ఆటగాళ్లకు..ఫ్యాన్స్ కి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. కాగా, ధావన్ స్థానంలో జట్టులోకి రిషబ్ పంత్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: