ఇండియా చేతిలో పాకిస్థాన్ ఘోరంగా ఓడిపోవటంతో ఆ టీం విమర్శలు ఎదుర్కొంటుంది. ఓటమి.. గెలుపు క్రీడల్లో కామన్.. దాన్ని లైట్ తీసుకుంటే అందరికీ మంచిది. కానీ పాక్ అభిమానులు మాత్రం దీన్ని వదిలేలా కనిపించడం లేదు. పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కు అవమానాల పరంపర కొనసాగుతోంది. గతంలో చాంపియన్స్ ట్రోఫి ఫైనల్లో భారత్ జట్టును ఓడించి కొత్త చరిత్ర సృష్టించాడు ఇదే పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.


అప్పుడు అందరూ వేయినోళ్ల పొగిడారు. కోహ్లీ సేన పోరాడి ఓడింది.అయితే భారత అభిమానులు ఇంతగా రియాక్ట్ అవ్వలేదు. పొగిడిన నోళ్లే ఇప్పుడు సర్ఫరాజ్ ను తిట్టిపోస్తున్నాయి.తాజాగా విరామం దొరకడంతో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లండ్ రాజధాని లండన్ లోని ఓ షాపింగ్ మాల్ కు ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు. అక్కడికి వచ్చిన పాకిస్తానీ అభిమాని మొదట సెల్ఫీ తీసుకుంటానని సర్ఫరాజ్ ను కోరాడట.. దీనికి ఒకే చెప్పాడు సర్ఫరాజ్.


దీంతో మొబైల్ లో వీడియో తీస్తూనే ఆ అభిమాని ‘పందిలా తయారయ్యావ్.. పాక్ ను గర్వపడేలా చేశావ్’ అంటూ తిట్ల దండకం మొదలుపెట్టాడట.. ఇది వీడియోలో రికార్డ్ కావడం.. అది షేర్ కావడంతో పాపం సర్ఫరాజ్ అవమానాల పాలయ్యాడు.పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ను అవమానించిన ఆ వీడియో వైరల్ అవుతోంది. అయితే చాలా మంది మాత్రం పాక్ కెప్టెన్ వెనకేసుకువస్తూ సదురు అభిమాని చర్యపై మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: