టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ త్వరలోనే రిటైర్ కాబోతున్నాడా.. ఈ ప్రపంచ కప్ తోనే తన రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నాడా.. ప్రపంచ కప్ లో భారత్ ఆడే చివరి మ్యాచే ధోనీ ఆడే అంతర్జాతీయ క్రికెట్ చివరి మ్యాచ‌్ కాబోతుందా..


అవునంటున్నాయి క్రీడావర్గాలు.. ఈ ప్రపంచ కప్ తో ధోనీ రిటైర్ మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ధోనీ బీసీసీఐకు సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. భారత్ కు అద్భుతమైన విజయాలు అందించిన ఈ సక్సస్ ఫుల్ మాజీ కెప్టెన్ ఆట నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడట.


ఇటీవల ప్రపంచ కప్ లో ధోనీ ఆటతీరుపై అనేక విమర్శలు వచ్చాయి. విపరీతంగా డాట్ బాల్స్ ఆడుతూ.. విసిగిస్తున్నాడని ప్రేక్షకులు కూడా ఫీలవుతున్నారు. ప్రత్యేకించి ఆఫ్గానిస్తాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ లపై ఆడిన మ్యాచుల్లో ధోనీ ప్రదర్శనపై అసహనం వ్యక్తమవుతోంది.


బంగ్లాదేశ్ మ్యాచ్ లో చివరి ఓవర్లలో పేలవంగా ఆడారన్న అపవాదు మూటగట్టుకున్నాడు ధోనీ. ధోనీ ఆటతీరుపై మాజీ క్రికెటర్లు కూడా అసంతప్తి వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విమర్శలతో మనస్తాపం చెందిన ధోనీ ప్రపంచ కప్ తర్వాత వైదొలగాలని నిర్ణయించుకున్నాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: