ఊహించిందే జరిగింది. సంచలనాలు నమోదు కాలేదు. అనుకున్నదే నిజమైంది. దాదాపు నెల రోజుల ముందు అభిమానులంతా ఏ జైట్లెతే సెమీఫైనల్ చేరుతాయని భావించారో ఆ నాలుగే నాకౌట్లో అడుగుపెట్టాయి. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్పై ఏ మూలో ఆశలు పెట్టుకున్నా.. ఆ రెండు జట్లు మేమింతే.. మా ప్రస్థానం ఇక్కడి వరకే అని డిసైడ్ అయిపోయాయి. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇప్పటికే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ బెర్త్లను ఖాయం చేసుకోగా తాజాగా న్యూజీలాండ్ చేరుకుంది.
న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో..ఈ రెండు జట్లలో న్యూజీలాండ్పైనే అనేక మంది అంచనాలు వేసుకున్నారు. అయితే, ఊహించింది. ఈ మ్యాచ్ అయిపోగానే బంగ్లాదేశ్తో పాటు పాకిస్తాన్ కూడా ఇంటికి పోయింది. బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ గెలిచినా.. ఓడినా.. ఇంటికే వెళ్లనుందనే దీంతో న్యూజిలాండ్కు సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫమ్ అయిపోయింది. దీంతో ఈసారి వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. ఇవాళ జరిగే మ్యాచ్లో 316 పరుగుల భారీ తేడాతో గెలవాలి. కానీ.. ఇవాళ్టి మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పాకిస్తాన్ కథ లీగ్ దశలోనే సమాప్తమయింది.
ఇమాముల్ 100, బాబర్ అజామ్ 96, ఇమాద్ 43 పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసి.. బంగ్లా ముందు 316 పరుగుల టార్గెట్ పెట్టింది పాకిస్థాన్. ఇక, బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 5 వికెట్లు తన ఖాతాలో వేసుకోగా... సైపుద్దీన్ మూడు వికెట్లు తీశాడు. ఇక 13 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది బంగ్లాదేశ్... ఈ మ్యాచ్లో గెలిచినా పాకిస్థాన్ ఇంటికి వెళ్లడం ఖాయమైపోయింది. కాగా, ఇప్పటికే అన్ని లీగ్ మ్యాచ్లు ఆడేసిన న్యూజిలాండ్ జట్టు 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది... ఇక చెరో మ్యాచ్ ఆడాల్సి ఉన్న ఆస్ట్రేలియా 14 పాయింట్లతో టీమిండియా 13 పాయింట్లతో వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. పాక్ ఈ మ్యాచ్ గెలిచినా 11 పాయింట్లతో కివీస్తో సమం అవుతుంది.. కానీ, రన్ రేట్ పరంగా కివీస్ జట్టే ముందుండడంతో ఏ విధంగా చూసినా ఇక పాకిస్థాన్కు అవకాశంలేకుండా పోయింది.