ఇప్పటి వరకు ఓ లెక్కా..ఇక నుంచి మరోలెక్కా అన్నట్లు ప్రపంచ కప్ 2019 ఇప్పటి వరకు ఆడిన ఆట ఒక ఎత్తైతే నేడు జరగనున్న సెమీ ఫైనల్ మరో ఎత్తు అని ఇరు జట్లు భావిస్తున్నాయి. నేడు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మద్య సెమీఫైనల్. ఐసీసీ వన్డే ప్రపంచకప్లో తొలి సెమీస్ మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి.
తాజాగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే అక్కడ పిచ్ లు బ్యాటింగ్ కి మంచి అనుకూలంగా ఉంటాయని భావించిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇక, భారత్ కూడా ఒక మార్పుతోనే బరిలోకి దిగుతోంది. కుల్దీప్ స్థానంలో చాహల్ జట్టులోకి వచ్చాడు. సరైన బోలింగ్ తో మరి న్యూజిలాండ్ ఆటగాళ్లను ఎంత వరకు కట్టడి చేస్తారో చూడాలి.