భారత క్రికెట్ జట్టులో తన బ్యాటింగ్ తో బౌలర్లకు ముచ్చెమటలు ఎలా పట్టిస్తారో..కీపర్ గా అలాంటి సత్తానే చాటుతుంటారు ఎంఎస్ ధోనీ.  తాజాగా టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

నేడు న్యూజ్ లాండ్ తో ప్రపంచ కప్ సెమీ ఫైనల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది ఆయనకు 350 వ వన్డే కావడం విశేషం.  ఇక భారత్ తరుపున అత్యదిక వన్డేలు ఆడిన రెండో బాట్స్ మన్ గా ధోని ఈ రికార్డు సృష్టించాడు. 

టీమ్ ఇండియా తరుపు నుంచి  మొదటి స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్ (463) వన్డే లతో ఉన్నాడు . మొత్తం క్రికెట్ లో అత్యదిక వన్డేలు ఆడిన 11వ బాట్స్ మన్ గా ధోని ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ యావత్ ప్రపంచం మొత్తం తీక్షణంగా వీక్షిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: