ప్రపంచకప్‌లో టీమిండియా ఖచ్చితంగా మనకు కప్ తెస్తుంది అనుకున్న భారత్ క్రికెట్ ప్రేమికుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లింది టీమిండియా. టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి 18 పరుగులతో తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది మన భారత్. అనుకున్నట్టుగా మంగళవారమే జరిగి ఉంటె మ్యాచ్ హిట్ అయ్యి మన భారత్ ఫైనల్స్ కు వెళ్ళేది. అలాంటి సమయంలో వర్షం పడి మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆలా ఆగిపోయిన మ్యాచ్ ఆగిపోయిన బాగుండు అంటున్నారు నెటిజన్లు. 


మనం గతంలో సాధించిన అత్యధిక పాయింట్స్ తో డైరెక్ట్ ఫైనల్స్ కు వెళ్ళేవాళ్ళం అని నెటిజన్లు వాపోతున్నారు. కానీ మన దురదృష్టం మొదటి నుంచి కష్టపడిన మన భారత్ ఆటగాళ్లు గెలవలేక పోయారు. దీనితో మన భారతీయ క్రికెట్ ప్రేమికులు కొంతమంది బాధపడితే, మరికొంతమంది మన భారత్ ఆటగాళ్లకు తిడితే మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. కొందరు మరి రెచ్చిపోతున్నారు. అందులో పాకిస్థాన్ వాళ్ళు చాల ఎక్కువ చేస్తున్నారు. పాకిస్థాన్ వాళ్ళు ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పన్ని మెమోస్ వేస్తున్నారు. 


టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీపై విమర్శలు భారీగా వస్తున్నాయి. అనుష్క శర్మ ఫ్యాన్స్ కూడా పన్ని మెమోస్ చేస్తున్నారు ఆ మెమోస్ ఏంటంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ పై పడుకున్నట్టు, అనుష్క శర్మ దిగులుగా చూస్తున్నట్టు ఫోటోని చిత్రీకరించారు. మరో ఫొటోలో పాకిస్థాన్ కెప్టేన్ విరుష్క ఫొటోని చూస్తూ నవ్వుతున్నట్టు ఫోటోని చిత్రీకరించారు. అయితే పాకిస్థాన్ పై ఆగ్రహానికి గురైన కొంతమంది నెటిజన్లు '' మేము సెమిస్ వరుకు అయినా వచ్చం, మీరు ఆదిలోనే అంతమయ్యారు కదా'' అని కామెంట్ చేశారు. ఏది ఏమైనప్పటికి టీమిండియా ఓడిపోవడం మనకు బాధ కలిగించింది.. వాళ్ళు కష్టపడ్డారు కానీ వరుణ దేవుడు ఆ కష్టాన్ని తన నీటిలో కలిపేసుకున్నాడు. అందుకు మన టీమిండియాను విమర్శించడం సరికాదు. వచ్చే వరల్డ్ కప్ మన ఇండియా ఖచ్చితంగా తీసుకొస్తుంది అని మనం నమ్ముదాం. మన క్రికెటర్స్ ను మనమే అవమానించడం ఏ మాత్రం సరికాదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: