.
ఇండియన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా దేశానికి ఎన్నో ట్రోఫీలు సంధించిన ఘనత ధోనీకి ఉంది. ఎటువంటి పరిస్థితిలో అయిన తడబాటు లేకుండా నిర్ణయాలు తీసుకునే ధోనీని మిస్టర్ కూల్ అని ముద్దుగా పిలుచుకుంటారు.

అయితే 2019 ప్రపంచ కప్ టోర్నీలో మాత్రం ధోని పై విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాటింగ్ లో సరిగా రాణించలేక పోయాడని, నిన్న జరిగిన సెమీస్ లో ఆడకుండా అనవసరంగా బంతులని వదిలేశాడని,జడేజా కు స్ట్రైక్ ఇవ్వాలనుకుంటే మొదటి బంతికే ఇచ్చేసి ఉండాలని ప్రతి ఓవర్ లో బంతులకి వృధాగా వదిలేసాడు అని కొంత మంది అభిమానులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా ధోని ఈ సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే దీనిపై లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ స్పందించారు."ధోనిజీ మధ్యకాలంలో మీ రిటైర్మెంట్ గురించి చాలా వార్తలు వింటున్నాను, దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. దేశానికి మీలాంటి క్రీడాకారులు ఎంతో అవసరం" అని లతా మంగేష్కర్ ట్విట్టర్ లో ట్విట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: