మాజీ క్రికెటర్స్ ఇప్పటికే ధోనీ రిటైర్మెంట్ గురించి స్పదించారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సెహ్వాగ్ కూడా చేరడం గమనార్హం. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ఒకవేళ వేటు వేయాలనుకుంటే ముందుగానే సెలక్టర్లు అతనికి ఒక మాట చెప్పాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. ప్రపంచకప్‌ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించగా.. అతను మాత్రం మిన్నకుండిపోయాడు. దీంతో.. వెస్టిండీస్ పర్యటనకి ఆదివారం సెలక్టర్లు ప్రకటించనున్న భారత్ జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ప్రపంచకప్‌లో ధోనీ పేలవ ప్రదర్శన నేపథ్యంలో.. అతనిపై వేటు వేస్తారా..? లేక జట్టులో చోటిస్తారా..? అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. వీరేంద్ర సెహ్వాగ్‌ని జట్టు నుంచి తప్పించే సమయంలో అతనితో మాట్లాడాల్సిందిగా సెలక్షన్ కమిటీలో సభ్యుడైన విక్రమ్ రాథోర్‌కి తాను చెప్పానని మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ చెప్పగా.. టీమ్‌ నుంచి తప్పించే వరకూ వేటు గురించి తనతో ఎవరూ మాట్లాడలేదని సెహ్వాగ్ వెల్లడించాడు.


దీంతో.. ఆ తప్పునకి తాను బాధ్యత వహిస్తున్నట్లు సందీప్ పాటిల్ అంగీకరించాడు. దీంతో.. కనీసం ధోనీ విషయంలోనైనా సెలక్టర్లు కాస్త హుందాగా వ్యవహరించాలని సెహ్వాగ్ సూచించాడు. ‘భారత్ జట్టు నుంచి అప్పట్లో నన్ను తప్పించిన తర్వాత తీరిగ్గా వచ్చి సెలక్టర్ విక్రమ్ నాతో మాట్లాడాడు. అయినా.. జట్టు నుంచి ఆటగాడ్ని తప్పించిన తర్వాత ఇక అతనితో మాట్లాడటానికి సెలక్టర్ల వద్ద ఏముంటుంది..? ఒకవేళ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ధోనీ విషయంలో ఇదే పంథాని అవలంబిస్తే..? ధోనీ మాత్రం ఏం చెప్పగలడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: