ఈ రోజు జరిగిన ఫైనల్లో పీవీ సింధు యమగుచి చేతిలో పరాజయం పాలైంది.బెస్ట్ ఆఫ్ త్రీ గా సాగే ఈ గేమ్ లో మొదటి గేమ్ లో 15-21 గా 15 పాయింట్లు సాధించి ఓడిపోయింది.అదే విధంగా రెండవ గేమ్ లోనూ 16-21 గా పదహారు పాయింట్ లు గెలిచి రెండవ గేమ్ లోనూ బోల్తాపడింది.
దీంతో రెండు గేమ్ లు వరుసగా ఓడిపోయి వెనుదిరిగింది.దీంతో ఎంతో కష్టంతో ఫైనల్ వరకూ చేరుకున్న సింధూ ఓటమి పాలైయ్యేసరికి భావోగ్వేదానికి గురైంది.