ఇండోనేషియాలో ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ జరుగుతున్న తరుణంలో క్వార్టర్ ఫైనల్లో సులభంగా గెలిచి సెమీ ఫైనల్ కు చేరుకున్న విష్యం తెలిసిందే.ఐతే,సెమీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకరైన చైనా క్రీడాకారిణి చెన్ యుఫేతో శనివారం తలపడింది.సెమీ ఫైనల్లో కూడా గెలిచి ఫైనల్ కు చేరుకున్న సింధు,ఫైనల్లో కొంచెం తడబడింది.


ఈ రోజు జరిగిన ఫైనల్లో పీవీ సింధు యమగుచి చేతిలో పరాజయం పాలైంది.బెస్ట్ ఆఫ్ త్రీ గా సాగే ఈ గేమ్ లో మొదటి గేమ్ లో 15-21 గా 15 పాయింట్లు సాధించి ఓడిపోయింది.అదే విధంగా రెండవ గేమ్ లోనూ 16-21 గా పదహారు పాయింట్ లు గెలిచి రెండవ గేమ్ లోనూ బోల్తాపడింది.


దీంతో రెండు గేమ్ లు వరుసగా ఓడిపోయి వెనుదిరిగింది.దీంతో ఎంతో కష్టంతో  ఫైనల్ వరకూ చేరుకున్న సింధూ ఓటమి పాలైయ్యేసరికి భావోగ్వేదానికి గురైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: