క్రికెట్ ప్రపంచంలో ఆటగాళ్లకు అభిమానులు తొందరగా ఏర్పడతారు,అభిమానులని పొందటానికి కేవలం వాళ్ళు చేయాల్సింది వాళ్ళ ఆటతీరుని మెరుగుపరుచుకోవడమే అలాంటి ఆటతీరునే ప్రదర్శించాడు రవీంద్ర జడేజా.సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లో తన వంతుగా కృషి చేసి జట్టును విజయ తీరాల వరకు తీసుకుపోయాడు.

సెమీఫైనల్ ముగిశాక సోషల్ మీడియా వేదికగా అభిమానులు రవీంద్ర జడేజాకు ఆకాశానికి ఎత్తేశారు.అలాగే రిషబ్ పంత్ ను కూడా అభిమానులు పొగడ్తలతో ముంచెత్తారు.ఐసీసీ తాజాగా  టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది అందులో రిషబ్ పంత్ 15వ స్థానం లో నిలిచాడు.

రిషబ్ పంత్ ఇప్పటి వరకు కేవలం 9 టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు,9 మ్యాచ్ లకే ఈ ఘనత సాధించడం చాలా అరుదు అని క్రికెట్ పెద్దలు అభిప్రాయ పడ్డారు. ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ టీమ్ కూడా బలంగానే ఉంటుంది అని క్రికెట్ అభిమానులు అభిప్రాయ పడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: