వరల్డ్ కప్ సిరీస్ సెమీఫైనల్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది భారత్.ఇండియా ఓటమికి చాలా మంది కారకులయ్యారు, బ్యాటింగ్ లో విఫలమైన టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్,3 పవర్ ప్లే లో 6 మంది ఫీల్డర్లు యార్డ్ లోపల ఉన్న పట్టించుకోని అంపైర్,నాలుగో స్థానం లో ఆటగాన్ని పట్టించుకోని సెలెక్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు.

అయితే ఇండియా ఓడిపోవడానికి ముఖ్య కారణం మాత్రం కేవలం కోహ్లీ మాత్రమే అంటున్నారు అభిమానులు. కోహ్లీ ప్రతిసారి ఇలానే చేస్తున్నాడని సిరీస్ చివరి నిమిషంలో చేతులు ఎత్తెయ్యడం తనకు అలవాటేనని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వెస్టిండీస్ సిరీస్ కు కూడా కోహ్లీ నే కెప్టెన్ కావడం కొంతమంది సహించలేక పోతున్నారు. మాకు కోహ్లీ కెప్టెన్ గా వొద్దు రోహిత్ ను పెట్టండి అని ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు కోహ్లీ మరో స్థానంపై న్యూజిలాండ్ సారథి విలియమ్సన్ కన్నేశాడు.తాజాగా ఐసిసి క్రికెట్ టెస్ట్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. 922 పాయింట్లతో కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా ..913 పాయింట్లతో విలియమ్సన్ రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ ప్రదర్శన ఏమాత్రం తగ్గినా విలియమ్సన్ మొదటి స్థానాన్ని అక్రమిస్తాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: