ఎప్పటినుండో మన భారతీయ క్రికెట్ టీమ్ లో క్రికెటర్ల మధ్య కొద్దిపాటి వివాదాలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అవి పెద్ద అంతర్యుద్ధాలకు అయితే దారి తీయలేదు. ఇక ఇటీవల జరిగిన ప్రపంచకప్ లో భారత్ సెమీస్ నుండి నిష్క్రమించడంతో, ఆ వివాదాలు మరింత ముదిరినట్లు సమాచారం. 

ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య గత కొద్దిరోజలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది అంటూ పలు పుకార్లు ప్రచారం అయ్యాయి. అయితే అవన్నీ పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని, పదకొండుమంది కలిసి ఒక జట్టుగా ఆడే సమయంలో కొద్దిపాటి బేధాభిప్రాయాలు రావడం సహజమని బిసిసిఐ టీమ్ సభ్యులు వాటిని కొట్టిపారేశారు. ఇక ఇటీవల వారిద్దరిమద్య వివాదం మరింత ముదిరిందని, దానితో మరింత ఆవేదన చెందిన రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ ను మరియు అతడి భార్య అనుష్కశర్మను తన ఇన్స్టాగ్రామ్ నుండి అన్ ఫాలో అయ్యారని సమాచారం. 

అంతేకాక ఇకపై కోహ్లీ కుటుంబంతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోదల్చుకోలేదని, అలానే వారి కుటుంబంలోని శుభ, అశుభాలకు కూడా ఎట్టిపరిస్థితుల్లో హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాడట. అయితే ఈ విషయమై కోహ్లీ కూడా రోహిత్ పై లోలోపల రగిలిపోతున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం, ఈ విధంగా కెప్టెన్, వైస్ కెప్టెన్ ఒకరిపై మరొకరు ద్వేషం పెంచుకోవడం రాబోయే రోజుల్లో టీమ్ కు కొంత నష్టం కలిగించేదిగా పరిణమించవచ్చు అంటున్నారు క్రీడా విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: