ప్రపంచ కప్ సెమిస్ లో  ఇండియా ఓడిపోవడం తో  సార్ ఆటగాళ్లు  రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ ల మధ్య గొడవలు మొదలయ్యాయని వస్తున్న వార్తలుప్రస్తుతం వైరల్ గా మారాయి.  వీరిద్దరూ  నిప్పు లేనిదే పొగ రాదు అన్న చందాన వ్యవహరిస్తుండడంతో  ఫ్యాన్స్ గొడవలు ఉన్నాయని  అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఓ వైపు  రోహిత్‌శర్మతో తనకు ఎలాంటి గొడవలు లేవంటూ విండీస్ టూర్ కి వెళ్లే ముందు   కోహ్లీ చెప్పుకొచ్చినా..  వీరిద్దరూ ప్రవర్తిస్తున్న తీరు  అందుకు  విరుద్ధంగా వుంది. 


 కోహ్లీ  విశ్రాంతి తీసుకోకుండా కేవలం రోహిత్ కు కెప్టెన్ పదివి దక్కకూడదనే  ఉద్దేశంతోనే చివరి నిమిషం లో  వెస్ట్ ఇండీస్ పర్యటనకు  అందుబాటులోకి వచ్చాడని  వార్తలు రావడంతో విభేదాలు ఉన్నాయని వచ్చిన వార్తలకు బలం చేకూరింది.   ఆ తరువాత ఇంస్టాగ్రామ్ లో  విరాట్‌, అనుష్కశర్మలను.. రోహిత్‌ అన్‌ఫాలో చేయగా రెండు రోజుల క్రితం రోహిత్‌శర్మ ట్విటర్‌లో తన ఫొటో ఒకటి షేర్‌ చేస్తూ  నేను జట్టు కోసం బరిలోకి దిగనుదేశం కోసం ఆడతాను అని పేర్కొన్నాడు. దాంతో  గొడవలు నిజమేనేమో అని  అభిమానులకు  ఓ ఆంచనాకు  వచ్చారు. 


ఇక  ఇప్పుడు రోహిత్ విషయంలో మరో సారి దొరికిపోయాడు  కోహ్లీ.  రోహిత్‌శర్మ లేని టీమిండియా ఆటగాళ్లతో కోహ్లీ ఓ ఫోటో   దిగి ఆ ఫొటోను  తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసాడు.  ఆ ఫోటో  కాస్త  సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ఆ ఫొటో ను చూసిన నెటిజన్లు రోహిత్‌ ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్నారు.   మరికొందరైతే  గొడవలున్నాయనే రోహిత్ ను కోహ్లీ  పక్కకు పెట్టాడంటూ కామెంట్లు పెడుతున్నారు.  ఒకేవేళ కోహ్లీ తమ  మధ్య గొడవలు లేవనే సంకేతాలు ఇవ్వాలనుకుంటే ఆ  ఫోటో   ఏదో రోహిత్ తోనే దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తే  సరిపోతుంది కదా. ఏది ఏమైనా కోహ్లీ చేసిన ఈపోస్ట్ తో ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని కన్ ఫార్మ్ చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: