ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో వెస్టిండిస్తో ఆదివారం జరిగిన టీ20 సిరీస్ రెండొవ మ్యాచ్లోను డక్వర్త్ లూయిస్ పద్దతిన 22 రన్స్ తేడాతో టీమిండియా విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా 20 ఓవర్లకు గాను 167 పరుగులు చేసింది.
అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 15.3 ఓవర్లకు 4వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి వర్షం పడటం మొదలయింది. వర్షం ఎంతసేపటికి తగ్గకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియాని విజేతగా ప్రకటించారు. దీంతో టీమిండియా మూడు టీ20 సిరీస్లో 2 సిరీస్ లను వశం చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 పరుగులు చేసి అర్ధ సెంచరీ రాణించాడు. ధవన్ 16 బంతుల్లో 3 ఫోర్లతో 23, క్రునాల్ 13 బంతుల్లో రెండు సిక్సర్లతో 20 తో రాణించారు. కాగా క్రునాల్కు రెండు వికెట్లు దక్కాయి దీంతో క్రునాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.