ఆంటిగ్వాలోకి సర్ వివ్ రిచర్డ్స్ స్డేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట వర్షం పడుతుండటంతో టాస్‌ని అంపైర్లు తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉండటంతో టాస్‌‌ని నిర్వహించారు. దీంతో భారత్ పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది వెస్టిండీస్. 


విండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటివరకు జరిగిన టీ-20 సిరీస్, వన్డే సిరీస్‌లను టీం ఇండియా సొంతం చేసుకొని మంచి జోష్‌లో ఉంది. ఇప్పడు ఈ టెస్ట్ సిరీస్‌ని కూడా దక్కించుకొని ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ని ఘనంగా ప్రారంభించాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు తొలి రెండు సిరీస్‌లను కోల్పోయిన విండీస్ ఈ సిరీస్‌లో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి వెస్టిండీస్ మ్యాచ్ లోను గెలుస్తుందా లేక టాస్ కి మాత్రమే అంకితమా అనేది తెలియాల్సి ఉంది. 


జట్ల వివరాలు:


భారత్: మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, హనుమ విహారీ, రిషబ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.


వెస్టిండీస్: క్రైగ్ బ్రాత్‌వైట్, జాన్ క్యాంప్‌బెల్, షాయ్ హోప్(కీపర్), శామ్రా బ్రూక్స్, డారెన్ బ్రావో, షిమ్రాన్ హెట్మేర్, రోస్టన్ ఛేజ్, జేసన్ హోల్డర్(కెప్టెన్), మిగ్యుల్ కమ్మిన్స్, శానన్ గ్యాబ్రియెల్, కీమర్ రోచ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: