వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆలా ఆలా సముద్రంలి ఎంజాయ్ చేస్తున్నారు. రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ ల లో రెండో టెస్టుకు కాస్త విరామం లభించడంతో ఆ సమయాన్ని కరీబియన్ దీవుల్లో ఆహ్లాదంగా గడుపుతున్నారు. తొలి టెస్ట్ గెలవడంతో తెగ ఎంజాయ్ చేస్తుంది టీమిండియా బ్యాచ్. ఆలా ఎంజాయ్ చేస్తూనే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు.
మొన్న ఈ మధ్యనే అనుష్క శర్మ బీచ్ పక్కన ఫోటో సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ అవుతే ఇప్పుడు ఈ ఫోటో పెట్టి మరోసారి వైరల్ చేస్తుంది. అంతలా ఆ ఫొటోలో ఏముంది అని అనుకుంటున్నారా ? ఉంది అండి ఆ ఫోటోలో టీమిండియా జట్టు అంత తెగ ఎంజాయ్ చేస్తున్న దృశ్యం మనముందు కనిపిస్తుంది. ఆ ఫోటోలో విరుష్క హైలెట్ గా కనిపిస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడి భార్య అనుష్క శర్మ, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్ ఆ ఫోటోలలో ఉన్నారు. ఈ ఫోటోలను చుసిన నెటిజన్లు వారికీ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలను రాహుల్, అశ్విన్ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.