మహిళా క్రికెట్ కు వన్నె తెచ్చిన గొప్ప మహిళా క్రికెటర్ ఆమె. కేవలం పురుషుల క్రికెట్ ఆట మాత్రమే ఉన్న సొంతమైన క్రికెట్ అభిమానులని ...వాళ్ళకంటే మేము ఎక్కడ తక్కువ కాము అంటూ నిరూపించిన మహిళా క్రికెట్ క్యాప్టెన్ ఆమె . ఒక్క సారి సారి బ్యాట్ జుళిపిస్తే మహిళలు కూడా పరుగుల వరద పారించగలరు అని నిరూపించింది .ఆమెనే మిథాలీ రాజ్ .
మహిళా క్రికెట్ కొత్త గుర్తింపు తెచ్చిన డైనమిక్ మహిళా క్రికెటర్ ..బ్యాట్ తో పరుగుల వరద పారించి దేశం చూపు మొత్తం మహిళా క్రికెట్ వైపు వచ్చేలా చేసింది మిథాలీ . తన ఆట తో అర్జున అవార్డును దక్కించుకుంది . తాజాగా మిథాలీ రాజ్ టి 20 క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించింది .2021 ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు దూరం అవుతున్నానని తెలిపింది .
టి 20 ఫార్మాట్ లో 89 మ్యాచులాడిన మిథాలీ మొత్తం 2364 పరుగులు సాధించింది .భారత్ నుండి అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ గా టాప్ ప్లేస్ లో ఉంది మిథాలీ . 2006 నుండి పొట్టి క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించగా ...మొత్తం 32 మ్యాచ్ లకి క్యాప్టెన్ గా వ్యవహరించింది . కాగా ఇందులో 2012 , 2014 ,2016 వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా ఉన్నాయి .
2021 వన్డే ప్రపంచకప్ టోర్నీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని...ప్రపంచకప్ పై పూర్తిగా ద్రుష్టి పెట్టేందుకు టి 20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది . అత్యుత్తమంగా పోరాడి భారత్ కి వరల్డ్ కప్ అందించాలనేది తన లక్ష్యం అని పేర్కొంది .. నన్ను నిరంతరం ప్రోత్సహించిన బీసీసీఐకి ధన్యవాదాలు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడే భారత టీ20 జట్టుకు అభినందనలు' అంటూ అని మిథాలీ భావోద్వేగంతోప్రకటించింది