ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో టీమిండియా బోణీ అదిరింది. ఈ టోర్నీలో భాగంగా వెస్ట్ఇండిస్‌తో జ‌రిగిన రెండు మ్యాచ్‌ల‌లో గెలిచిన ఇండియా ఖాతాలో 120 పాయింట్లు చేరాయి. దీంతో ఇండియా ప్ర‌స్తుతం టాప్‌లో ఉంది. ఇక ఇంగ్లండ్‌తో యాషెస్‌లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆసీస్ రెండో స్థానంలో ఉంది. భార‌త్‌తో స‌మానంగా రెండు మ్యాచ్‌ల‌లో గెలిచినా ఐసీసీ నిబంధ‌న‌లు ఇండియాను టాప్ ప్లేసులో నిల‌బెట్టాయి.


20-20ల‌ రాకతో రోజురోజుకూ ఆదరణ కోల్పోతున్న టెస్ట్ క్రికెట్ ను బ్రతికించాలన్న ఆలోచ‌న‌తో ఐసీసీ ఈ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ టోర్న‌మెంట్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్రతి జట్టు మిగతా అన్ని అంతర్జాతీయ జట్లతో రెండేళ్లలోపు టెస్ట్ సీరిస్ ఆడాల్సి వుంటుంది. ఈ క్రమంలో గెలుపొందిన జట్లు కొన్ని నిబంధనలను అనుసరించి పాయింట్లను పొందుతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ ఉంటుంది.


ఇక సీరిస్‌లో ఉన్న మ్యాచ్‌ల‌ను బ‌ట్టి పాయింట్లు ఉంటాయి. ప్ర‌తి సీరిస్‌కు మ్యాచ్లు ఎన్ని ఉన్నా పాయింట్లు 60 ఉంటాయి. వెస్టిండిస్‌తో రెండు మ్యాచ్‌ల‌లో గెలిచిన ఇండియాకు 60 పాయింట్లు వ‌చ్చాయి. అదే ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సీరిస్ లో రెండిట్లో  గెలిచి, ఒక్కింట ఓటమిపాలై, మరో మ్యాచ్ డ్రా చేసుకున్న ఆసిస్  మొత్తం(24+24+8) 56 పాయింట్లను మాత్రమే పొందింది. సీరిస్‌కు 120 పాయింట్లు ఉంటాయి. రెండు టెస్ట్‌లు ఉంటే మ్యాచ్‌కు 60 పాయింట్లు, మూడు టెస్ట్‌లు ఉంటే మ్యాచ్‌కు 40 పాయింట్లు, నాలుగు టెస్ట్‌ల సీరిస్ అయితే మ్యాచ్‌కు 30, ఐదు టెస్ట్‌లు ఉంటే మ్యాచ్‌కు 24 పాయింట్లు ఉంటాయి.


ఇలా రెండు టెస్టుల సీరిస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేన(60+60) 120 పాయింట్లను పొందింది. అదే ఆసిస్ యాషెస్ సీరిస్ లో భాగంగా  ఇంగ్లాండ్ తో ఐదు టెస్టు  మ్యాచులు ఆడుతోంది. కాబట్టి తక్కువ పాయింట్లు  పొందింది. ఐసిసి నిబంధనల మూలంగా భారత్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో అగ్రస్థానంలో నిలిచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: