ఈ మధ్య కాలంలో కొంతమంది వృద్దుల కోరికలు విచిత్రంగా ఉంటున్నాయి. కొంతమంది వారి కోరికలు వారే తీర్చుకోవడం వల్ల ప్రపంచ రికార్డుకు ఎక్కుతున్నారు. అలానే గత నెల మంగాయమ్మ అనే 74 వృద్ధురాలు ఇద్దరు కావాలా పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డులో పేరు సాధించింది. అయితే ఇప్పుడు రికార్డుకి ఎక్కే సంఘటన ఎం జరగలేదు కానీ అందరిని ఆశ్చర్యపరిచే ఘటన అయితే తమిళనాడులో జరిగింది. 


వివరాల్లోకి వెళ్తే .. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే 70 ఏళ్ళ వృద్ధుడు వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధుతో వివాహం చేయాలని ఆ జిల్లా కలెక్టర్ ని కోరాడు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.


కలెక్టర్ కి అందచేసిన అర్జీలో ఇలా రాశాడు. ''సింధు బ్యాడ్మింటన్‌ ఆడే పద్ధతి నాకు చాల నచ్చింది, సింధును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చెయ్యండి లేకుంటే ఆమెను కిడ్నప్ చేసి అయినా సరే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ అతను చెప్పుకొచ్చాడు. కాగా ఆ 70 ఏళ్ళ వృద్ధుడు వయసు కేవలం 16 సంవత్సరాలే అని, 2004 ఏప్రిల్ 4వ తేదీన పుట్టాడని రాసుకొచ్చాడు. అయితే ఆ వృద్ధుడి కోరిక విని అక్కడ ఉన్నవారంతా షాక్ అయిపోయారు. మరి ఈ ఘటనపై పీవీ సింధు స్పందన ఏంటో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: