విశాఖపట్నం లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ విజయ ఢంకా మోగించింది. 203 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పలు రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా రోహిత్ తన బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. ఈ  మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అప్పటి వరకు టెస్టులకు పనికి రాడు అనుకున్న వారందరూ ఈ మ్యాచ్ లో అతని ప్రదర్శనతో ముక్కున వేలేసుకున్నారు.



ఓపెనర్ గా దిగిన మొదటి మ్యాచ్ లోనే రెండు సెంచరీలు చేసి అద్భుతమైన రికార్డు సాధించాడు. అయితే ఈ మ్యాచ్ లో అతని ఆటతీరుకు ప్రతీ ఒక్క క్రికెట్ అభిమాని ఫిధా అయిపోయాడు. హిట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సర్లతో మైదానంలో మెరుపులు మెరిపించాడు. అతని ఆట చూసిన వారందరూ వీరేంద్ర సెహ్వాగ్ లా ఆడాడని మెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత మైదానంలో సెహ్వాగ్ ని చూసినట్టు అనిపించిందని అభినందించారు.


ఇదిలా ఉండగా స్వయంగా వీరేంద్ర సెహ్వాగ్ రోహిత్ ఆటని ప్రశంసిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా స్పందించాడు. ఇది రోహిత్‌కు అద్భుతమైన టెస్టు మ్యాచ్‌. టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా ఆడాలన్న రోహిత్‌ కల ఇన్నాళ్ళకు నెరవేరింది. ఇక ముందు కూడా నీకు అంతా మంచి జరగాలి. ఇండియా సాధించిన గొప్ప విజయాల్లో ఇది కూడా ఒకటి ఇందులో యంక్‌ అగర్వాల్‌, షమీ, అశ్విన్‌, పుజారాల పాత్ర కూడా చాలా ఉందని వారికి కూడా తన అభినందనలు తెలియజేశాడు.


సెహ్వాగ్ లా ఆడాడని మెచ్చుకుంటే, ఇప్పుడు స్వయంగా సెహ్వాగే రోహిత్ ని మెచ్చుకోవడంతో రోహిత్ శర్మ ని అభిమానించే వారిలో ఉత్సాహం ఉప్పొంగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: