టీమిండియా యువ ఆటగాడు మనీష్ పాండే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.  దక్షిణాది నటి  అర్షితా  శెట్టి ని  పెళ్లి చేసుకోబోతున్నాడు.  ఈ ఏడాది డిసెంబర్ 2న ముంబైలో వీరిద్దరూ ఒకటి  కాబోతున్నారని సమాచారం . వీరిద్దరూ గత కొన్నాళ్లుగా  ప్రేమలో ఉన్నారనే గుస , గుసలు  వినిపిస్తూనే ఉన్నాయి.   విందులు ,  వినోదాలకు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ జంట,  ఇప్పుడు ఒకటి కావాలని నిర్ణయించుకున్నట్లు  తెలుస్తోంది. మనీష్ , ఆర్షితలు గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారన్న ఊహాగానాలు కాస్త  ఇప్పుడు నిజమేనని తేలిపోయింది . 


ప్రస్తుతం మనీష్ విజయ్ హజారే టోర్నీలో పాల్గొనే కర్ణాటక జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు . టీమిండియా కు చెందిన ఈ మిడిల్ ఆర్డర్ స్టయిలిష్ బ్యాట్స్ మెన్ జట్టులో నిలకడగా స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు . పెళ్లి తరువాతైనా జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటాడేమో చూడాలి .   ముంబాయికి చెందిన 26 ఏళ్ల  ముద్దుగుమ్మ ఆర్షిత  దక్షిణాది సినిమాల్లో నటిస్తోంది. తొలుత  తుళు భాషలో తెలికేడాబొల్లి   సినిమాతో 2012లో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు,  తమిళం లో  ఉదయం ఎన్ హెచ్   4  చిత్రం ద్వారా కోలీవుడ్ కు  పరిచయమైంది.


 ఓరు  కన్నియుమ్  మూను  కలవాని కులమ్ సినిమా ద్వారా నటిగా     మంచి పేరు తెచ్చుకుంది. నాన్ దా శివ  సినిమాతో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ ,  ప్రస్తుతం ఆర్ పన్నీర్ సెల్వం  దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోందని తెలుస్తోంది . మనీష్ పాండే , ఆర్షితా శెట్టి   వివాహం అతి కొద్ది మంది బంధువులు , సన్నిహితుల మధ్యనే  జరగనుందని తెలుస్తోంది.  వెస్టిండీస్ తో  జరిగే టీ20 సిరీస్ సందర్భంగా డిసెంబర్ 2న ముంబైలోనే టీమిండియా క్రికెట్ జట్టు ఉందనున్న నేపధ్యం లో మనీష్ , ఆర్షిత వివాహానికి ఆటగాళ్లంతా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: