అయితే పుజారా తో కలిసి మయాంక్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ జోడి లంచ్ వరకు మరో వికెట్ పడనీయకుండా ఆచి తూచి ఆడారు. ఈక్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీ లు పూర్తి చేశారు. మరింత ప్రమాదకరంగా మారుతున్న ఈజోడి ని రబాడ విడదీశాడు. 58పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద పుజారా , రబడా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరువాత కోహ్లీ తో కూడా మయాంక్ చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీం ఇండియా ను పటిష్ట సిత్థిలో నిలిపాడు. ఈదశలో మయాంక్ కెరీర్ లో రెండో సెంచరీ సాధించాడు. అయితే సెంచరీ చేసిన కాసేపటికి మయాంక్ క్యాచ్ అవుట్ అయ్యి పెవిలియన్ చేరుకున్నాడు. ఈవికెట్ కూడా రబాడ ఖాతాలోనే పడింది. ఇక ఆతరువాత కోహ్లీ , అజింక్యా రహానే లజోడి మరో వికెట్ పడనీయలేదు. ప్రస్తుతం కోహ్లీ 63పరుగులతో రహానే 18పరుగులతో క్రీజ్ లో వున్నారు.