భారత పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు సూష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ చేసాడు. ఈ ఢిల్లీ డైనమైట్ కు ఇది 7వ డబుల్ సెంచరీ. తద్వారా భారత్ తరఫున అత్యధిక ద్విశతకాలు సాధించిన బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డుల పుటల్లోకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 6 డబుల్ సెంచరీల రికార్డును ఢిల్లీకే చెందిన కోహ్లీ బద్దలు కొట్టడం విశేషం.


అంతేకాదు, ప్రపంచ క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీల జాబితాలో నాలుగోస్థానానికి ఎగబాకాడు. కేవలం 81 టెస్టుల్లోనే కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆసీస్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ (52 టెస్టులు) ఉన్నాడు. డాన్ ఖాతాలో 12 డబుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కరటెస్టులు (134 టెస్టులు) 11 ద్విశతకాలతో రెండో స్థానంలో, 9 డబుల్ సెంచరీలతో వెస్టిండీస్ బ్యాటింగ్ కింగ్ బ్రియాన్ లారాటెస్టులు (131) మూడో స్థానంలో ఉన్నారు.


ఇక, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 7000 పరుగులు సాధించాడు. ఏడు వేల పరుగుల మైలురాయిని ఓ డబుల్ సెంచరీతో సాకారం చేసుకున్న తొలి బ్యాట్స్ మన్ కోహ్లీనే. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ (254 నాటౌట్) సాధించాడు. విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఇది ఏడో డబుల్ సెంచరీ. క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. 


దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ (254 నాటౌట్) సాధించాడు. విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఇది ఏడో డబుల్ సెంచరీ. సర్ డాన్ బ్రాడ్‌మన్ కెప్టెన్‌‌గా 150 కంటే ఎక్కువ పరుగులను ఎనిమిదిసార్లు చేశాడు. ఇప్పటికి కోహ్లీ కెప్టెన్‌గా తొమ్మిదిసార్లు 150, అంతకంటే ఎక్కువ పరుగులను సాధించి రికార్డు తిరగ రాశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: