ఇదిలావుంటే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నిన్న కోల్ కత్తా లో ఓ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు గంగూలీ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మీరు రవిశాస్త్రితో మాట్లాడారా అని అడిగిన ప్రశ్నకు గంగూలీ .. ఎందుకు మాట్లాడాలి ..అతను ఇప్పటివరకు ఏం చేశాడు? అని సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానంలోనే తెలుస్తుంది. రవిశాస్త్రి , గంగూలీ కి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందోనని.. ఇప్పుడు ఎలాగూ గంగూలీ బీసీసీఐ బాస్ అయ్యాడు కాబట్టి ముందు ముందు రవిశాస్త్రికి తిప్పలు తప్పకపోవచ్చు. ఇక ఈనెల 23న గంగూలీ , బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నాడు. 24న సెలెక్టర్ల తో సమావేశం అయ్యి మాజీ సారథి ధోని భవితవ్యం పై చర్చిస్తామని గంగూలీ అన్నాడు. నిబంధల ప్రకారం ఈసమావేశానికి రవిశాస్త్రి హాజరుకాడని కూడా గంగూలీ క్లారిటీ ఇచ్చాడు.