తమిళనాడు వ్యాప్తంగా ఎన్ ఐ ఏ దాడులు నిర్వహిస్తోంది. దేశంలో ఉగ్ర దాడులకు ప్లాన్ చేసిన నలుగురిని ఎన్ ఐ ఏ అధికారులు తమిళనాడులో అరెస్టు చేశారు. గత మూడు రోజులుగా జరుపుతున్న సోదాల్లో ఎన్ ఐ ఏ అధికారులు కీలక సమాచారం సంపాదించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 
మొత్తం పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ, కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తుంది. తమిళనాట భారీగా నిధులు సేకరిస్తున్నారన్న సమాచారంతో మన్నడిలో సయ్యద్ బుహారీ, మంజకొళ్ళెలో హరీష్, మహమ్మద్ అలీ, సిక్కల్లో హసన్, అలీలను ఎన్ ఐ ఏ అదుపు లోకి తీసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: