చెన్నై కి చెందిన కమెడియన్ మంజునాథ్ నాయుడు (36) కొంతకాలంగా దుబాయ్ లో ఉంటున్నాడు.స్టాండప్ కమెడియన్ గా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.


కాగా, అందులో భాగంగానే ఓ స్టార్ హోటల్ లో షో చేస్తున్న సమయంలో వేదిక మీద కుప్పకూలి చనిపోయాడు.దాంతో అక్కడ అంతా తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.


అయితే, మంజునాథ్ కిందపడటం కూడా షోలో భాగమని అనుకున్నారు నిర్వాహకులు.దాంతో ఎంతసేపటికీ పైకి లేవకపోవడంతో తేరుకొన్న ప్రజలు ఆసుపత్రికి తరలించారు.


కానీ అప్పటికే ఆయన చనిపోయాడని తేల్చి చెప్పారు డాక్టర్లు.పరిస్తితిని గమనించిన డాక్టర్లు,షో చేస్తున్నప్పుడే గుండెపోటు రావడంతో చనిపోయుండచ్చని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: