పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది.నిడమర్రు మండలంలో యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి పక్కనే ఉన్న పొలం లోకి లాక్కెళ్లాడు. యువతి స్పృహ కోల్పోవడంతో చనిపోయిందని భావించి బురదలో పూడ్చిపెట్టాడు. కొద్ది సేపటి తరువాత యువతికి స్పృహ రావడంతో అతి కష్టంగా ఇంటికి చేరుకుంది. యువతి పరిస్థితి చూసిన ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.


బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటన పై బాధితురాలి కుటుంబ సభ్యులు యువకుడి బంధువులు మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. పెళ్లికావల్సిన అమ్మాయి కావడంతో మాట్లాడేందుకు వారు అంగీకరించడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిడమర్రు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించటంతో ఆమె లొంగకపోవటంతో బలవంతంగా పక్కనే ఉన్న పొలంలోకి లాక్కెళ్లాడు.



యువతి స్పృహ కోల్పోవడంతో చనిపోయిందని భావించి బురదలో పూడ్చిపెట్టాడు.కొద్ది సేపటి తర్వాత యువతికి స్పృహ రావడంతో మైకంతో ఇంటికి చేరుకుంది.యువతి పరిస్థితి చూసిన ఆమె కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతికి గురయ్యారు.తరువాత ఆ యువతి యొక్క పరిస్థితి చూసి వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.ఈ ఘటన పై బాధితురాలి కుటుంబ సభ్యులు యువకుడి బంధువులతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: