డిల్లీలో మళ్లీ మరో ఘోరం చోటుచేసుకుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతి మీద ఒక క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేశాడు.ఆ యువతి జెఎన్‌యు లో ఫారెన్ ల్యాంగ్వేజ్  కోర్స్ రెండవ సంవత్సరం చదువుతుంది. తాను శుక్రవారం రాత్రి తన స్నేహితుడి ఇంటి నుంచి తిరిగి వస్తున్న సమయంలో మందిర్ మార్గ్ ప్రాంతం నుంచి తాను క్యాబ్ ఎక్కిందని,



తర్వాత క్యాబ్ డ్రైవర్ తనకు ఏదో ఇచ్చాడని అది తీసుకున్న తర్వాత తను స్పృహ కోల్పోయిందని చెప్పింది.ఆ తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్ తనను అత్యాచారం చేశాడని, తర్వాత క్యాబ్ డ్రైవర్ సుమారు 3 గంటల పాటు డ్రైవ్ చేశాడని బాలిక పోలీసులకు తెలిపింది.అత్యాచారం చేసిన తర్వాత కూడా ఆమెను సుమారు 3 గంటలపాటు అదే క్యాబ్ లో తిప్పి డిల్లీలోని బక పార్కు సమీపంలో ఆమెను వదిలేశాడని , ఆ తర్వాత అక్కడి స్థానికులు తనను ఆసుపత్రిలో చేర్చగా అక్కడి వైద్యులు ఆమే పై లైంగిక వేధింపులు జరిగాయని చెప్పారు.




ఆమె డిశ్చార్జ్ అయిన తరువాత, ఫిర్యాదుదారుడు ఆమె హాస్టల్‌కు చేరుకుని, ఈ సంఘటనను అధికారులకు వివరించాడు.స్టేట్‌మెంట్ కోసం ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. ఆమె వివరణ ఆధారంగా పోలీసులు క్యాబ్‌ను కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: