ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో పెద్ద నోట్ల రద్దు అనంతరం చలామణిలోకి వచ్చిన రూ. 2,000 నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేసిందని.. దీంతో ఈ నోట్లు రద్దవుతాయా అనే ఊహాగానాల ఎక్కువ అయ్యాయి . 2016 నవంబర్ 8న అప్పటికి చలామణిలో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.

అనంతరం కొత్త రూ. 500 నోటుతో పాటు, కొత్తగా రూ. 2,000 నోటు కూడా చలామణిలోకి వచ్చింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ నోటు ప్రజల్లో మామూలై పోయింది. ఏటీఎంకు వెళ్లి రూ.2,000 లకు మించి డబ్బు డ్రా చేస్తే ఈ పెద్ద నోటు తప్పక వస్తుంది.అయితే.. కొద్ది రోజులుగా ఈ నోటు అంతగా కనిపించడం లేదు. కారణం, ఆర్‌బీఐ రూ.2,000 నోట్ల ముద్రను నిలిపివేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు. సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు ఆర్‌బీఐ ఈ వివరాలు వెల్లడించింది.


దీంతో రూ. 2,000 నోట్లు రద్దు కానున్నాయా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నోట్ల రద్దు అనంతరం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542 మిలియన్ల నోట్లు ముద్రించగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111 మిలియన్ నోట్లు ముద్రించారు. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలో 46 మిలయన్లకు ఈ ముద్రనను కుదించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ. 2,000 నోటు కూడా ముద్రించలేదు. అధిక విలువ కలిగిన నోట్ల చలామణిని తగ్గించడం ద్వారా నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. మరి రూ. 2,000 నోట్లు రద్దు అవుతాయా? కొనసాగుతాయా? అనే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: