బుల్లితెర ఫుల్ క్రేజ్ సంపాదించిన మల్టీ టాలెంటెండ్ కమెడియన్ సుడిగాలి సుధీర్. యాక్టింగ్, కామెడీ, డ్యాన్స్, మ్యాజిక్, సింగింగ్ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడీ యంగ్ స్టార్. ఇక ఇటీవల జబర్దస్త్ కామెడీ షోతో క్రేజ్ సంపాదించిన సుడిగాలి సుధీర్.. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా కూడా మారారు. సుధీర్, ధన్య బాలక్రిష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సుధీర్కు ఫ్యాన్ ఫాలోంగ్ అంతా ఇంతా కాదు.
ఇదిలా ఉంటే.. సాధారణంగా ఏ పండుగ వచ్చినా ఈటీవీ ఛానెల్ వారు ఒక సరికొత్త ఈవెంట్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా మంచి మంచి ఈవెంట్స్ చేస్తూ తీసిపోని టీఆర్పీ రేటింగ్స్ కూడా సంపాదిస్తుంది. అయితే ఈ సారి కూడా మల్లెమాల సంక్రాంతి సందడి మొదలైంది. ఈ సారి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రోజా.. తొలి ప్రోమోలో ఎమ్మెల్యే కొడుకు కిడ్నాప్ అంటూ హడావిడి చేయడంతో ప్రత్యేక కార్యక్రమం మొదలైంది. జబర్దస్త్ కంటెస్టెంట్స్ పిల్లలతో డిజైన్ చేసిన సంక్రాంతి ప్రోగ్రాంకు అమ్మ నాన్న సంక్రాంతి అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షో యాంకర్గా వ్యవహరిస్తున్న ప్రదీప్ను రోజా షాక్కు గురిచేసే కామెంట్స్ చేసారు. నీకు పెళ్లి అయి ఉంటే నా ప్రోగ్రామ్ కు వచ్చేవాడివి. అంటూ బతుకు జట్కా బండిని గుర్తు చేస్తూ చేసిన కామెంట్స్ అందరికి నవ్వు తెప్పించాయి. అయితే ఈ ప్రోగ్రామ్లో సుడిగాలి సుధీర్ను హైలైట్ చేశారు. ఈ ప్రోగ్రామ్కు ఓ గంగిరెద్దును స్పెషల్ గెస్ట్గా తీసుకొచ్చారు. దాన్ని స్టేజ్ మీదకు తీసుకొచ్చి ఆది.. సుధీర్ గురించి ప్రశ్నలు అడిగాడు. సుధీర్కు 40 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా' అనగానే అది అవును అన్నట్లుగా తల ఊపింది. దీంతో సుధీర్ దారుణంగా బలైపోయాడు. ఇక ఏం చేయాలో తెలియక షాక్లో ఉండిపోయాడు.