బుల్లితెర బాహుబలిగా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ‘కార్తీకదీపం’ సీరియల్. తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పవచ్చు. ఈ సీరియల్ దెబ్బతో మిగితా చానెల్స్ వారికి పోటీ పెరిగిందంటే అతిశయోక్తి కాదు. సినిమా హీరోలను మించి అభిమానం ఈ సీరియల్ కేరక్టర్లకు ఉంది. ముఖ్యంగా కార్తీకదీపం డైలీ సీరియల్ ద్వారా తెలుగు ఆడపడుచుల్లో ఒక్కరిగా దీప మారిపోయింది. అదేనండీ.. దీప అలియాస్ వంటలక్క. అంతేకాదు.. ఈ సీరియల్లో ఉన్న ఏ ఒక్క క్యారెక్టర్ను ప్రేక్షకులు మర్చిపోలేరు. ఎందుకంటే.. బుల్లితెరను ఏలుతున్న సీరియల్ ఇదే కాబట్టి.
ఇక కార్తీక దీపం సీరియల్ ఒక కీలక దశకు వచ్చేసింది.
ఇప్పటికే దీప దగ్గర పెరుగుతున్న సౌర్యకు తన తండ్రి డాక్టర్ కార్తీక్ అన్న విషయం తెలిసిపోయింది. మరోవైపు కార్తీక్ దగ్గర పెరుగుతున్న హిమకు సైతం వంటలక్క దీపతో డాక్టర్ బాబును ఇచ్చి పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే.. జనవరి 17 ఎపిసోడ్లో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. సీరియల్లో మౌనిత, పనిమనిషి ప్రియమణి ఉదయాన్నే ఉల్లిపాయలు కొనడానికి బయలుదేరతారు. అయితే దారిలో ఓ దొంగ ప్రియమణి మెడలో గొలుసు కొట్టెయ్యడానికి ప్రయత్నిస్తాడు. దాంతో వాడ్ని పట్టుకుని చితక్కొడుతుంది ప్రియమణి.
ఇంతలో పోలీస్ పరుగున వచ్చి నాకు అప్పగింజమ్మా అనడంతో.. నేను మంగళవారం సంతలో ఇష్టపడి 20 రూపాయలు పెట్టి కొన్న గొలుసు కొట్టేస్తాడా?అనడంతో మౌనిత, పోలీస్, ఆ దొంగ నోరు వెళ్లబెడతారు 20 రూపాయలకు ఇంత కోటింగా? అనుకుంటారు. అయితే ఇంతలో కార్తీక్ అక్కడకి వస్తాడు. దొంగను పోలీస్ తీసుకుని వెళ్తుంటే.. దొంగ తన పర్స్ పాడేసుకుంటుంది. అది తీసి చూసిన మౌనిత.. పోలీస్ని, దొంగని వెనక్కి పిలిచి.. పర్స్ దొంగకు ఇచ్చి.. ‘వీడ్ని వదిలెయ్యండి’ అని పోలీస్కి చెబుతుంది. ‘అక్కా నువ్వు దేవతవే.. ఇలాంటి దేవతలు జైల్లో కూడా దొరకరు అంటూ వెళ్లిపోతాడు.
దీంతో దొంగను ఎందుకు వదిలేశారమ అని ప్రియమణి అడగగా.. ఇంతలో మౌనిత కార్తీక్ వైపు ఓరగా చూస్తూ.. ‘వాడి పర్స్ చూశాను కదా నేను. అందులో వాడి పేరు కార్తీక్ అని ఉంది. అందుకే వదిలెయ్యమన్నాను’ అంటుంది. కార్తీక్ మాత్రం వాడు పర్స్ కొట్టేసిన వాడి పేరు కూడా కార్తీక్ అయ్యుండొచ్చుగా అంటాడు. నిజానికి కేవలం కార్తీక్ పేరుందని ఏకంగా దొంగనే వదిలేయడం కాస్త ఓవర్గానే అనిపిస్తుంది.